పండితుల ప్రకారం ఈ ప్రత్యేకమై రోజున భక్తులు జంటనాగులని ప్రతిష్టించి, నాగులకు అభిషేకం చేయాలి. సర్ప శాంతి కోసం హోమాలు, జపాలు, ప్రాయశ్చిత్తపూర్వక పూజలు నిర్వహించడం అత్యంత ముఖ్యమని సూచన. ముఖ్యంగా, జంటనాగులు ఉన్న ఆలయాల్లో శక్తివంతమైన పూజలు జరుపుకోవడం వల్ల సమస్యలు తొలగుతాయని నమ్మకం ఉంది.
ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసం కూడా పాటిస్తే, కాలసర్పదోషం శాంతి చెందుతుందని విశేషంగా చెప్పబడుతోంది. భోళా శంకరుడిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా కూడా ఈ సమస్యలు దూరమవుతాయని పండితులు తెలిపారు. సంతానం లేని వారికి ప్రత్యేక సూచనలూ ఉన్నాయి. జంటనాగులు ఉన్న రావి చెట్టు చుట్టూ తెల్లని కంకణం ద్వారా పదకొండు చుట్టులు చుట్టి, తమ కోరికను చెట్టుకు తొట్లెట్లలో ముడివేయడం వల్ల భగవంతుని అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
భక్తులు ఉదయం పూజకు ముందు స్వచ్ఛంగా ఉండడం, పంచామృతం, పూలు, ఫలాలు పూజలో సమర్పించడం వంటి సాంప్రదాయాలను పాటిస్తారు. కార్తీక మాసంలో నాగుల చవితి ప్రత్యేక శక్తిని కలిగిన పండగ. పూజల ద్వారా కాలసర్పదోషాలు తొలగించడం, కుటుంబ సమస్యలు పరిష్కరించడం, సంతానం కల్పించడం వంటి లక్ష్యాలు సాధ్యమవుతాయి. భక్తులు ఈ రోజు ఆలయాల్లో చక్రాకారంగా చేరి, నాగుల పూజలో భాగమవుతారు.
The post నాగుల చవితి నాడు ఇలా చేస్తే.. కాలసర్పదోషం తొలగిపోతుందంట..! appeared first on Telugu Rajyam.